America లో మ‌రో భార‌తీయ విద్యార్థి మృతి.. వ‌రుస‌గా 10వ ఘ‌ట‌న‌

America: అమెరికాలో భార‌తీయ విద్యార్ధుల‌కు ర‌క్ష‌ణ లేదా? అక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. ఒక‌టి కాదు రెండు కాదు.. 2023 నుంచి 2024 మ‌ధ్య‌లో ఏకంగా 9 మంది భార‌తీయ విద్యార్ధులు చ‌నిపోయారు. కొంద‌రు హ‌త్య‌కు గుర‌వ‌గా మ‌రికొంద‌రు అనుమానాస్ప‌ద స్థ‌తిలో మ‌ర‌ణించారు.

ఇప్పుడు ప‌దవ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో చ‌దువుకుంటున్న ఉమా స‌త్య‌సాయి గ‌ద్దె అనే యువ‌కుడు అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు. ఈ విష‌యాన్ని న్యూయార్క్‌లోని భార‌త దౌత్యాధికారులు ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. త్వ‌ర‌లో స‌త్య‌సాయి మృత‌దేహాన్ని అత‌ని స్వ‌స్థ‌లానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. అయితే స‌త్య‌సాయి ఎలా చ‌నిపోయాడు అనే విష‌యం మాత్రం తెలియ‌రాలేదు.

ALSO READ:  Indians Dying In USA: మ‌న విద్యార్ధుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారా?