Manipur: మ‌రో గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌

Manipur: మ‌ణిపూర్‌లో (manipur) మ‌రో గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మే నెల‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన ఓ బాధితురాలు రిలీఫ్ క్యాంప్‌లో చికిత్స పొంది కోలుకున్న త‌ర్వాత పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చూరాచంద్‌పూర్ జిల్లాకు (churachandpur) చెందిన 37 ఏళ్ల మ‌హిళ త‌న ఇల్లు మంట‌ల్లో కాలిపోతుంటే.. పిల్ల‌ల్ని, మ‌రో ఇద్ద‌రు బంధువుల‌తో క‌లిసి పారిపోయేందుకు య‌త్నించింది. ఆ క్ర‌మంలో కొంద‌రు వ్య‌క్తులు ఆమెను అడ్డుకుని అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ట‌. ఆ త‌ర్వాత త‌న‌ను రిలీఫ్ క్యాంప్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపింది. చాలా మంది మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తుంటే త‌న‌కూ ధైర్యం వ‌చ్చి ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నాన‌ని తెలిపింది. (manipur violence)

మ‌హిళ వెల్ల‌డించిన వివ‌రాలు

మే 3న సాయంత్రం 6:30 ప్రాంతంలో కొందరు వ్య‌క్తులు మా ఇంటిని, మా ఇంటి చుట్టు ప‌క్క‌న ఉన్న ఇళ్ల‌ని త‌గ‌ల‌బెట్టారు. ఆ స‌మ‌యంలో ఇంట్లో నేను నా ఇద్ద‌రు పిల్ల‌లు, ఇద్ద‌రు బంధువులు ఉన్నారు. పిల్ల‌ల్ని భుజాన వేసుకుని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసాం. ప‌రిగెడుతున్న స‌మ‌యంలో రాయి అడ్డు త‌గిలి బిడ్డ‌తో స‌హా కింద ప‌డిపోయా. అప్ప‌టికే మ‌మ్మ‌ల్ని వెంబ‌డిస్తున్న వ్య‌క్తులు న‌న్ను ప‌ట్టుకున్నారు. మా వ‌దిన నా పిల్ల‌ల్ని తీసుకుని ప‌రుగులు తీసింది. కానీ నేను దొరికిపోయాను. ఎంత వేడుకున్నా వ‌ద‌ల్లేదు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేతులు వేస్తూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడారు. అలా నాపై న‌లుగురు వ్య‌క్తులు అత్యాచారం చేసారు. ఆ త‌ర్వాత నేను ఈ రిలీఫ్ క్యాంప్‌కి చేరుకున్నాను. ఇన్నాళ్లూ ఈ విష‌యం బ‌య‌టికి తెలిస్తే నా కుటుంబ ప‌రువుపోతుంద‌ని, చుట్టు ప‌క్క‌ల వారు చిన్న‌చూపు చూస్తార‌ని చెప్ప‌లేదు, కానీ నాలాంటి ఎంద‌రో మ‌హిళ‌లు ఇప్పుడు ఫిర్యాదులు చేస్తుంటే ధైర్యం వ‌చ్చి చెప్తున్నా అని బాధితురాలు పోలీసుల‌కు వెల్ల‌డించింది.