ఏపీలో మరో ఘోర ప్రమాదం.. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చెలరేగిన మంటలు

another fire accident in pharma city

 

అచ్యుతాపురం సెజ్ ప్రమాదం మరవక ముందే.. విషకపట్నం జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో అర్థరాత్రి రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారు విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.