Facebook Love: ఏపీ యువ‌కుడి కోసం వచ్చిన శ్రీలంక యువతి

AP: ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాల్లో ప్రేమించేసుకుని (facebook love) దేశాలు దాటేస్తున్న ల‌వ్ స్టోరీలు ఎక్కువ అవుతున్నాయి. మొన్న‌టివ‌ర‌కు ఇండియ‌న్ కోసం పాకిస్థాన్ మ‌హిళ (seema haider) భార‌త్‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత పాకిస్థాన్ యువ‌కుడి కోసం రాజ‌స్థాన్ మ‌హిళ (anju) పాక్ వెళ్లింది. మూడో ఘ‌ట‌నలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ యువ‌కుడి కోసం బంగ్లాదేశ్ యువ‌తి ఇక్క‌డికి వ‌చ్చేసింది.

ఇప్పుడు నాలుగో ల‌వ్ స్టోరీ మ‌న తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది. శ్రీలంక‌కు (srilanka) చెందిన యువ‌తి.. చిత్తూరు (chitoor) జిల్లాకు చెందిన యువ‌కుడి కోసం వ‌చ్చేసింది. శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి..లక్ష్మణ్‌ల‌కు ఫేస్‌బుక్‌ పరిచయం ఏర్పడింది. గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. విజిటింగ్ వీసాపై ఈనెల 8న విఘ్నేశ్వరి చిత్తూరు చేరుకుంది. దాంతో లక్ష్మణ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. వీసా గడువు ముగిసేలోగా శ్రీలంక తిరిగి వెళ్లిపోవాలని చిత్తూరు పోలీసులు విఘ్నేశ్వరికి నోటీసులు ఇచ్చారు.