Adani పెద్ద‌మ‌న‌సు.. రైలు ప్ర‌మాదంలో అనాథ‌లైన పిల్ల‌ల‌కు ఉచిత విద్య‌

Odisha: అదానీ (adani) గ్రూప్ సంస్థ‌ల ఛైర్మ‌న్ గౌత‌మ్ అదానీ (gautam adani) పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. శుక్రవారం రాత్రి ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్ర‌మాదంలో (odisha train accident) త‌ల్లిదండ్రులను కోల్పోయిన పిల్ల‌ల‌కు ఉచిత విద్య ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని గౌత‌మ్ అదానీ ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. “ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర ప్ర‌మాదం మా మ‌న‌సుల్ని క‌ల‌చివేసింది. ప్ర‌మాదంలో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌కు ఉచిత విద్య‌ను అందించాల‌ని అదానీ సంస్థ నిర్ణ‌యించింది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.