మెయింటైనెన్స్ కోసం ఏడు పెళ్లిళ్లు చేసుకున్న మ‌హిళ‌

a woman from karnataka marries 7 times for this reason

Viral News:  విడాకులు తీసుకున్నాక మెయింటైనెన్స్ డ‌బ్బులు వ‌స్తాయ‌ని ఆశ‌ప‌డి ఓ మ‌హిళ నిత్య పెళ్లికూతురిలా మారింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ మ‌హిళ దాదాపు ఆరుగురు వ్య‌క్తుల‌ను పెళ్లి చేసుకుంది. వారితో దాదాపు ఏడాది పాటు క‌లిసుండి ఆ త‌ర్వాత స‌రైన స‌మ‌యం చూసుకుని వారిపై 498A కేసు పెట్టింది. అలా ఆరుగురి నుంచి మెయింటైనెన్స్ డ‌బ్బులు, భ‌ర‌ణం పుచ్చుకుంది.

ఆ త‌ర్వాత ఇటీవ‌ల ఏడో పెళ్లి చేసుకుంది. అత‌నితో కూడా ఏడాది క‌లిసుంది. ఇక అతని నుంచి కూడా విడిపోయి అత‌నిపై కూడా 498A కేసు వేసింది. ఇప్పుడు ఆ కేసు కోర్టులో వాద‌న‌లకు రాగా.. ఆమె ఆల్రెడీ ఆరు సార్లు పెళ్లి చేసుకుని మెయింటైనెన్స్ కోసం కోర్టుకు వచ్చింద‌ని జ‌డ్జి క‌నుక్కున్నాడు. దాంతో నువ్వు చ‌ట్టంతో ఆడుకుంటున్నావ్ అంటూ ఆమెకు కోర్టులోనే చీవాట్లు పెట్టాడు. మిగ‌తా ఆరుగురు మాజీ భ‌ర్త‌ల‌ను కూడా పిలిపించి అస‌లు ఏం జ‌రిగిందో స‌రిగ్గా విచార‌ణ చేప‌ట్టాల‌ని జ‌డ్జి ఆదేశించాడు.