Odisha Train Accident: పట్టాల‌పై ఎముక‌లు.. తెగి ప‌డిన అవ‌య‌వాలు!

Odisha: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న (odisha train accident) స‌మ‌యంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఓ ప్ర‌యాణికుడు ఘ‌ట‌న‌ను వివ‌రిస్తున్న తీరు వ‌ణుకు పుట్టించేలా ఉంది. ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి ఓ గంట ముందు నిద్ర‌పోయాన‌ని, లేచి చూసేస‌రికి ప‌క్క బోగీలు చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయ‌ని తెలిపాడు. యాక్సిడెంట్ (odisha train accident) ఘ‌ట‌న చూసేస‌రికి ఒక్క‌సారిగా నిద్ర‌మ‌త్తు వ‌దిలిపోయిందని అన్నాడు. తాను నిద్ర‌లేచే స‌రికే త‌న‌పై 10 నుంచి 15 మంది ప‌డిపోయి ఉన్నార‌ని, బ‌య‌ట‌ప‌డ‌టానికి చాలా క‌ష్ట‌పడ్డాన‌ని తెలిపాడు. త‌న‌కు చేతికి, మెడ ద‌గ్గ‌ర గాయాల‌య్యాన‌ని చెప్పాడు. ఎలాగోలా బ‌య‌టికి వ‌చ్చాక చూసేస‌రికి ప‌ట్టాల‌పై విరిగిన ఎముక‌లు, ర‌క్త‌పు మడుగులు, తెగి ప‌డిన అవ‌య‌వాలు చూసి క‌ళ్లుతిరిగాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసాడు.