Banglore: ఘోరం.. క‌రెంట్ తీగ త‌గిలి త‌ల్లి, ప‌సికందు స‌జీవ‌ద‌హ‌నం

Banglore: బెంగళూరులో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మహాదేవపుర ప్రాంతంలో విద్యుత్ అధికారులు ఫుట్ పాత్ మీద నిర్లక్ష్యంగా కరెంట్ తీగ వదిలేయడంతో అటుగా వెళ్తున్న ఓ మ‌హిళ‌కు షాక్ కొట్టింది. దాంతో ఆమె అక్క‌డికక్క‌డే ఒంటికి నిప్పు అంటుకుంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యింది. ఆ స‌మ‌యంలో ఆ మ‌హిళ చేతిలో 9 నెలల చిన్నారి కూడా ఉంది. ఈ దారుణ ఘ‌ట‌న చూసిన స్థానికులు త‌ల్లి, బిడ్డ కాలిపోతుంటే ఏమీ చేయ‌లేక గ‌ట్టిగా కేక‌లు వేస్తూ నిలుచుండిపోయారు.