పసికందుని రేప్ చేసి.. దోమ కుట్టింద‌ని నాట‌కం ఆడి..

Crime News: 23 నెల‌ల పాప‌ను ప‌లుమార్లు రేప్ చేసిందే కాకుండా ఇదేంట‌ని అడిగితే దోమ కుట్టింద‌ని నాట‌కం ఆడాడు ఓ నీచుడు. ఈ దారుణ ఘ‌ట‌న ముంబైలో చోటుచేసుకుంది. 2021లో 21 ఏళ్ల వ్య‌క్తి త‌న చెల్లెలికి పుట్టిన బిడ్డ‌పై ప‌లుమార్లు అత్యాచారం చేసాడు. పాప ఒంటిపై గాయాలు చూసి నిల‌దీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. వెంటనే పాప త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్లుగా సుదీర్ఘ విచార‌ణ సాగిన ఈ కేసులో ఈరోజే తీర్పు వెల్ల‌డైంది.

అయితే వాద‌న‌ల స‌మ‌యంలో నిందితుడు పాపకు ప్రైవేట్ భాగంలో దోమ‌లు కుట్టాయ‌ని అందుకే అక్క‌డ గాయం అయింద‌ని చెప్పాడు. అది విన్న జ‌డ్జ్ మండిప‌డ్డారు. దోమ కుడితే త‌నంత‌ట తానే చేతుల‌తో గోక్కునే వ‌య‌సు పాప‌కు లేద‌ని అయినా దోమ కుడితే ప్రైవేట్ భాగం అంత‌గా ఎలా గాయ‌ప‌డుతుంది అని గ‌డ్డిపెట్టారు. నిందితుడిని దోషిగా ప్ర‌క‌టిస్తూ 20 ఏళ్ల క‌ఠిన కారాగాల శిక్ష విధించింది. (crime news)