Medak: దోస లేదంటే కత్తితో దాడి చేయబోయాడు

Medak: దోస కోసం ఓ వ్య‌క్తి టిఫిన్ సెంట‌ర్ ఓన‌ర్‌ని క‌త్తితో పొడ‌వ‌బోయాడు. ఈ ఘ‌ట‌న మెద‌క్ (medak) జిల్లాలో చోటుచేసుకుంది. రామాయంపేటకు చెందిన‌ మర్కు స్వామి అనే యువకుడు స్థానిక టిఫిన్ సెంటర్లో దోస కావాల‌ని అడిగాడు. అప్ప‌టికే దోస‌లు అయిపోవ‌డంతో లేదు అని చెప్పారు. దోసెలు లేన‌ప్పుడు టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టారు అంటూ యజమానిపై దాడికి దిగాడు. దీంతో అతడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.