Crime: త‌న జ్యూస్ బండి ప‌క్క‌నే మ‌హిళ వ్యాపారం.. చంపేసిన వ్య‌క్తి

Kanpur: ఒక వ్యాపారం చేసుకునే వ్య‌క్తి ప‌క్క‌న మ‌రో వ్య‌క్తి వ‌చ్చి అదే వ్యాపారం మొద‌లుపెడితే వారి మ‌ధ్య గొడ‌వ‌లు (crime) జ‌రుగుతుండ‌డం ఎప్ప‌టినుంచో చూస్తున్నాం. కానీ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌కి (kanpur) చెందిన ఓ వ్య‌క్తి మాత్రం గొడ‌వ ప‌డ‌ట‌మే కాదు ఏకంగా హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కాన్పూర్‌కి చెందిన మ‌నోజ్ జ్యూస్ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం అదే బండి ప‌క్క‌న జ‌య‌మంతి దేవి అనే మ‌హిళ మ‌రో జ్యూస్ బండి పెట్టింది. దాంతో మ‌నోజ్ ఆమెతో గొడ‌వ‌ప‌డ్డాడు. రెండు రోజుల్లో బండి తీసేసి వేరే ప్రాంతంలో పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించాడు. ఇందుకు దేవి ఒప్పుకోలేదు. దాంతో త‌న స్నేహితుల‌తో మాట్లాడుకుని ఎలాగైనా దేవిని చంపేయాల‌నుకున్నాడు. అలా నిన్న రాత్రి దేవి షాప్ ద‌గ్గ‌ర ఉండ‌గా కారుతో తొక్కించి ఆమెను కొన్ని మీట‌ర్ల వ‌ర‌కు లాక్కెళ్లాడు. దాంతో దేవి అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. సీసీటీవీలో ఈ ఘ‌ట‌న రికార్డు అవడంతో పోలీసులు మ‌నోజ్‌తో పాటు మ‌రో న‌లుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నాడు.