Karnataka: మొసలిని కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు!

క‌ర్ణాట‌క‌లో (karnataka) రైతుల ఆందోళ‌న‌లు తారాస్థాయికి చేరుతున్నాయి. క‌రెంట్ స‌రిగ్గా ఇవ్వ‌క‌పోవ‌డంపై క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈరోజు ఉద‌యం ఓ రైతు ఏకంగా మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వ‌దిలాడు. కరెంటు ఇవ్వకుంటే విద్యుత్ సబ్ స్టేషన్ ఆఫీసులో ఆందోళ‌న‌లు మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. (karnataka farmers issue)