Telangana: విద్యార్థిని కాళ్లపై నుంచి దూసుకెళ్లిన లారీ

Telangana: మేడ్చల్ జిల్లా యంనంపేట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనంపేట్ వద్ద అతివేగంతో వ‌స్తున్న లారీ హ‌ర్షిత అనే 20 ఏళ్ల‌ విద్యార్థిని కాళ్లపై నుంచి వెళ్లింది. లారీ నెంబ‌రు TS30T3949 గా పోలీసులు గుర్తించారు. శ్రీనిధి కళాశాల బీటెక్ సెకండియర్ చదువుతున్న హర్షిత ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళ్ళతున్న సమయంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.