Tamilnadu: ఘోర అగ్ని ప్ర‌మాదం..11 మంది దుర్మ‌ర‌ణం

త‌మిళ‌నాడులో (tamilnadu) ఘోర అగ్ని ప్ర‌మాదం (fire accident) చోటుచేసుకుంది. శివ‌కాశిలోని (sivakasi) రెండు టపాసులు త‌యారుచేసే ఫ్యాక్ట‌రీల్లో మంట‌లు అంటుకోవ‌డంతో 11 మంది మృతిచెందారు. మృతుల్లో 9 మంది మ‌హిళ‌లు ఉన్నారు. సాంపుల్స్ టెస్ట్ చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin) మృతుల కుటుంబాల‌కు రూ.3 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.