Covid: ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా..!

Covid: తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. తెలంగాణ‌లో 50కి పైగా యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. జైశంక‌ర్ భూపాల‌ప‌ల్లిలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కోవిడ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధారించారు. దాంతో వారి నివాసం మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా మార్చేసారు. మ‌రోప‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యాక్టివ్ కేసులు 23కు చేరాయి. విశాఖ‌ప‌ట్నంలో 17 యాక్టివ్ కేసులు న‌మోదయ్యాయి. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 4,054కు చేరింది. ఒక్క కేర‌ళ‌లోనే 3000 కేసులు న‌మోద‌య్యాయి.