J&K: ఉగ్ర‌వాదుల ఘాతుకం.. 4 సైనికులు దుర్మ‌ర‌ణం

జ‌మ్మూ క‌శ్మీర్‌లోని (j&k) పూంచ్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. భార‌త సైనికుల వాహనం పూంచ్ జిల్లాలోని డేరా కీ గాలి ప్రాంతం నుంచి వెళ్తుంద‌ని తెలిసుకున్న ఉగ్ర‌వాదులు ఒక్కసారిగా సైనికుల వాహ‌నంపై కాల్పులు జ‌రిపారు. ఈ దాడిలో న‌లుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.