3 రాష్ట్ర పోలీసుల‌ను షాక్‌కు గురిచేసిన కిలాడి యువ‌తి క‌థ

3 state police gets shocked by a woman's murder plan

Viral News:  స‌మాజం, న్యాయ చట్టాల ప‌ట్ల గౌర‌వం లేక‌నో.. ఎలా దొరుకుతాంలే అన్న ధీమానో తెలీదు కానీ.. ఈ మ‌ధ్య‌కాలంలో జ‌రుగుతున్న ఘోరాలు చూస్తుంటే ముందు చేసేద్దాం ఆ త‌ర్వాత ఏదైతే అదైంది అనే ధోర‌ణిలో ఉన్నారు. మ‌గ‌, ఆడ అనే తేడా లేకుండా అంద‌రూ విచ‌క్ష‌ణ మ‌రచి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇలాంటి కేసులు రోజు రోజుకీ త‌గ్గాలే కానీ విచిత్రంగా పెరిగిపోతున్నాయి.

ఇంత‌కీ ఇప్పుడు మ్యాట‌ర్ ఏంటంటే.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ యువ‌తి వేసిన మ‌ర్డ‌ర్ ప్లాన్ ఏకంగా మూడు రాష్ట్రాల పోలీసులను షాక్‌కు గురిచేసింది. పెళ్లై భ‌ర్త ఉన్న‌ప్ప‌టికీ అభం శుభం తెలీని మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుని ఆ త‌ర్వాత అత‌న్ని దారుణంగా చంపేసింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తాప్‌గ‌డ్ ప్రాంతానికి చెందిన పుష్ప‌, వినోద్ దంప‌తులు హ‌రియాణాలోని గురుగ్రామ్‌లో ఐటీ కంపెనీల్లో ప‌నిచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న కంపెనీలో పనిచేస్తున్న శివ‌నాథ్ అనే వ్య‌క్తితో పుష్ప ఎఫైర్ పెట్టుకుంది. శివ‌నాథ్ స్వ‌స్థ‌లం బిహార్. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కే శివ‌నాథ్ బోర్ కొట్టేయడంతో అత‌న్ని వ‌దిలించుకోవాల‌ని అనుకుంది. ఇందుకు శివ‌నాథ్ ఒప్పుకోలేదు.

దాంతో శివ‌నాథ్ గురించి పుష్ప త‌న భ‌ర్త వినోద్‌కు చెప్పింది. దాంతో ఇద్ద‌రూ క‌లిసి శివ‌నాథ్‌ను చంపేయాల‌ని ఓ ప్లాన్ వేసారు. ఇందుకోసం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సున్వాసా ప్రాంతంలో నివ‌సిస్తున్న త‌న స్నేహితురాలు పూన‌మ్ ఇంటికి వెళ్లారు. పూన‌మ్‌కి ఆమె భ‌ర్త‌కు జ‌రిగిన‌దంతా చెప్పి శివ‌నాథ్‌ను చంపేయాల‌ని ప్లాన్ వేసారు. ప్లాన్ ప్ర‌కారం పుష్ప శివ‌నాథ్‌కు ఫోన్ చేసి త‌న స్నేహితురాలు పూన‌మ్ ఇంటికి రావాల‌ని కోరింది. దాంతో శివ‌నాథ్ ఎంతో సంతోషంతో వెళ్లాడు. అత‌ను పూన‌మ్ ఇంట్లోకి వెళ్ల‌గానే గొంతు నులిమి చంపేసారు. ఆ త‌ర్వాత దారుణంగా గొడ్డ‌లితో అత‌ని మృత‌దేహాన్ని మూడు ముక్క‌లుగా న‌రికి పూన‌మ్ ఇంటి వెనుక భాగంలోనే పాతిపెట్టారు.

కొంత‌కాలంగా శివ‌నాథ్ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాక‌పోయే స‌రికి అత‌ని త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. దాంతో బిహార్, ఉత్త‌ర్‌ప్రదేశ్‌, హ‌రియాణా పోలీసులు క‌లిసి అత‌ని కోసం గాలింపులు చేప‌డుతుండ‌గా.. చివ‌రి ఫోన్ కాల్ పుష్ప‌కే చేసాడ‌ని తెలిసింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని కాస్త గ‌ట్టిగా విచార‌ణ చేపట్ట‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు మృత‌దేహాన్ని వెలికి తీసి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. పుష్ప‌ని ఆమె భ‌ర్త‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి సాయం చేసిన పూన‌మ్‌, ఆమె భ‌ర్త మాత్రం పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.