Telangana: అయ్యో చిట్టి త‌ల్లీ..!

Telangana: హైద‌రాబాద్‌లోని హ‌బ్సీగూడ ర‌వీంద్ర‌న‌గ‌ర్‌లో దారుణం చోటుచేసుకుంది. మిథున్ అనే వ్య‌క్తి త‌న కుమారుడిని స్కూల్ బ‌స్సు ఎక్కించ‌డానికి బయ‌ట‌కు వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో రెండేళ్ల కూతురిని మిథున్ త‌ల్లి బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. ఆ స‌మ‌యంలో నాన్న ద‌గ్గ‌ర‌కు వెళ్తాను అంటూ పాప ప‌ర‌గెత్తుకుంటూ మిథున్ వ‌ద్ద‌కు చేరుకోగానే బస్సు డ్రైవ‌ర్ చూసుకోకుండా పోనిచ్చాడు. బ‌స్సు చ‌క్రాల కింద ప‌డి పాప అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది.