25 కిలోల బంగారం ధ‌రించి శ్రీవారి ద‌ర్శ‌నానికి..!

2 men wear 25 kgs of gold to tirumala

Viral News:  ఈరోజు ఉద‌యం శ్రీవారి ద‌ర్శ‌న స‌మ‌యంలో ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇందుకు కార‌ణం వారిద్ద‌రూ చెరో 25 కిలోల చైన్లు వేసుకుని వెళ్ల‌డ‌మే. వీరిద్ద‌రి వివ‌రాలు తెలీవు కానీ.. అంతా వీరిని పుణె బ్ర‌ద‌ర్స్ అని పిలుస్తుంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం శ్రీవారి ద‌ర్శ‌నానికి కానీ మ‌రే ఆల‌యానికి వెళ్లినా ఆ 25 కిలోల ఆభ‌ర‌ణాలు వేసుకుని వెళ్తుంటార‌ట‌. దాంతో తిరుమ‌ల‌లో వీరి ఫ్యామిలీ వైర‌ల్‌గా మారింది.