Kerala Floods: ఆ అమ్మాయిల‌ను మేం పెళ్లి చేసుకుంటాం

2 men from kerala wants to marry women who lost their home in kerala floods

Kerala Floods: కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు విల‌య ప్ర‌ళ‌యం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 200 మంది మృత్యువాత‌ప‌డ‌గా.. వేలాది కుటుంబాలు త‌మ ఇళ్ల‌ను కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌లోని కొట్టాయంకు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు.. వ‌ర‌ద‌ల కార‌ణంగా అన్నీ కోల్పోయిన అమ్మాయిలు ఎవ‌రైనా ఉంటే తాము పెళ్లి చేసుకుంటామ‌ని ముందుకొచ్చారు. విష్ణు కుమార్, దీపు రాజ్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు వ‌ర‌ద‌ల కార‌ణంగా అన్నీ కోల్పోయిన అమ్మాయిలు ఉంటే వారిని తాము ఇష్టంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వెల్ల‌డించారు.

వ‌ర‌ద‌ల కార‌ణంగా చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాల‌ని విష్ణు త‌ల్లి కోరింద‌ట‌. దాంతో విష్ణు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపాడు. ఈ నేప‌థ్యంలో దీపురాజ్, విష్ణు క‌లిసి రేపు వాయ‌నాడ్‌కు వెళ్లి బాధితుల‌కు త‌మ వంతు సాయం చేయాల‌ని అనుకుంటున్నారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా తల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుంటామ‌ని కొంద‌రు.. ఇళ్ల‌ను కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం అని మ‌రికొంద‌రు త‌మ మంచి మ‌న‌సును చాటుకుంటున్నారు.