Gujarat: ఘోర బోటు ప్ర‌మాదం.. 16 మంది దుర్మ‌ర‌ణం

Gujarat: గుజ‌రాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు సాయంత్రం వ‌డోద‌రాలోని హార్ని న‌దిలో పిల్ల‌ల్ని పిక్నిక్‌కు కోసం తీసుకురాగా అంద‌రూ బోటు రైడ్ ఎక్కారు. బోటు బ‌రువు ఎక్కువ అవ‌డంతో న‌ది మ‌ధ్య‌లో మునిగిపోయింది. ఈ దారుణ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ఉపాధ్యాయులు, 14 మంది విద్యార్ధ‌లు గ‌ల్లంత‌య్యారు. వారంతా మృతిచెంది ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 10 మంది విద్యార్ధుల‌ను సురక్షితంగా న‌ది నుంచి బ‌య‌ట‌కు తీసారు.