Viral News: 20 రోజుల్లో 13 మంది పిల్ల‌లు అనుమానాస్ప‌ద మృతి

13 kids die in delhi under mysterious circumstances

Viral News: ఢిల్లీలో 13 మంది చిన్నారుల అనుమానాస్ప‌ద మృతి సంచ‌ల‌నంగా మారింది. ఢిల్లీ ప్ర‌భుత్వం న‌డుపుతున్న ఆశా కిరణ్ షెల్ట‌ర్ హోంలో ఉంటున్న చిన్నారుల్లో రోజుల వ్య‌వ‌ధిలోనే ఒక్కొక్క‌రుగా చ‌నిపోతున్నారు. దాదాపు 20 రోజుల వ్య‌వ‌ధిలోనే 13 మంది చిన్నారులు చనిపోయారు. అయితే వారు ఎందుకు చ‌నిపోతున్నారు అనే అంశంపై ఇప్ప‌టికీ పోలీసుల‌కు కూడా క్లారిటీ లేదు. ఆ చిన్నారుల మృతదేహాల‌కు పోస్ట్ మార్టం నిర్వ‌హిస్తేనే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని పోలీసులు తెలిపారు.