Sabarimala: అయ్య‌ప్ప స‌న్నిధిలో విషాదం

Sabarimala: కేర‌ళ‌లోని సుప్ర‌సిద్ధ శ‌బ‌రిమ‌లై పుణ్య‌క్షేత్రంలో విషాదం నెల‌కొంది. స్వామి ద‌ర్శ‌నం కోసం వెళ్లిన 11 ఏళ్ల బాలిక ర‌ద్దీ ఎక్కువ కావ‌డంతో ఎక్కువ సేపు నిల‌బ‌డ‌లేక కుప్ప‌కూలిపోయింది. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టినా పాప ప్రాణం నిల‌వ‌లేదు. బాలిక‌ది త‌మిళ‌నాడు అని.. చిన్న‌ప్ప‌టి నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోంద‌ని పోలీసులు తెలిపారు. బిడ్డ చ‌నిపోవ‌డంతో త‌ల్లిదండ్రులు బోరున విల‌పించారు. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో కొన్ని గంట‌ల పాటు పాప అలాగే నిల‌బ‌డాల్సి వ‌చ్చింద‌ని.. దాంతో గుండెపోటు వ‌చ్చి ఉంటుంద‌ని చెప్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌తో ట్రావెన్‌కోర్ ఆల‌య బోర్డు అధికారులు వ‌ర్చువ‌ల్ టికెట్ బుకింగ్స్ సంఖ్య‌ను రూ.90,000 నుంచి రూ.80,000ల‌కు చేసారు.