Viral News: ఎంత మోసం.. పెళ్ల‌య్యాక ప్రియుళ్ల‌తో లేచిపోయిన 11 మంది మ‌హిళ‌లు

11 married woman elope with their lovers

Viral News: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో వింత సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అక్క‌డి ప్ర‌భుత్వం గృహిణుల‌కు ప్ర‌ధాన‌మంత్రి గ్రామీణ ఆవాస్ యోజ‌న‌ ప‌థ‌కంలో భాగంగా కొంత డ‌బ్బు సాయం చేస్తోంది.  దీని వ‌ల్ల పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు ఇళ్లు క‌ట్టుకునే సౌల‌భ్యం ఉంది. ల‌బ్ధిదారుల ఖాతాలో రూ.40 వేల వ‌ర‌కు జ‌మ చేస్తున్నారు.

అయితే ఈ ప‌థ‌కం గృహిణుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. దీనిని ఆస‌రాగా తీసుకుని స్థానిక ప్రాంతాల‌కు చెందిన దాదాపు 11 మంది మ‌హిళ‌లు మోసాల‌కు పాల్ప‌డ్డారు. ప‌థ‌కం ద్వారా వ‌చ్చే డ‌బ్బుల కోసం అప్ప‌టిక‌ప్పుడు పెళ్లిళ్లు చేసుకుని త‌మ ఖాతాల్లో డబ్బు ప‌డ‌గానే త‌మ ప్రియుళ్ల‌తో లేచిపోయారు. ఈ నేప‌థ్యంలో ఒక్కొక్క‌రుగా త‌మ భార్య వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది మ‌హిళ‌లు ఇలా డ‌బ్బుతో త‌మ ప్రియుళ్ల‌తో వెళ్లిపోయారు.

లేచిపోయిన మ‌హిళ‌లంతా స్థానిక మ‌హారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన‌వారిగా గుర్తించారు. తొలి విడ‌తలో భాగంగా ఈ జిల్లాలోనే ప‌థ‌కం డ‌బ్బులు జ‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు.