Students Commits Suicide: ఉరేసుకున్న టెన్త్‌ విద్యార్థినులు

Students Commits Suicide: యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10వ తరగతి చదువుతున్న భవ్య (15), వైష్ణవి (15) త‌మ‌ను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు హాస్టల్‌ వార్డెన్‌ శైలజకు ఫిర్యాదు చేశారు. హాస్టల్‌ వార్డెన్‌ మందలించడంతో భవ్య, వైష్ణవిలు చున్నీలతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. సూసైడ్‌ నోట్‌లో “”మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి. మా ఆఖరి కోరిక ఇది “” అని రాసున్న లేఖ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.