లైవ్​లో పాటపాడి అలరించిన బాలయ్య!

Doha: నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ(TDP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను మనదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం దోహా పట్టణంలో ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీనికి ఎన్టీఆర్ (NTR) తనయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో పాటి పాడి ప్రేక్షకులను అలరించారు బాలయ్య. ఇదివరకు కూడా బాలయ్య అనేకసార్లు లైవ్​లో పాటపాడిన సంగతి తెలిసిందే. కానీ ఈ వేదికపై బాలయ్య పాడిన పాటకు ప్రేక్షకుల నుంచి స్టాండింగ్​ ఒవేషన్​ అందుకున్నారు.

పలు వేదికలపై తన సినిమాల్లోని పాటలు పాడిన బాలయ్య ఈసారి ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ (Jagadekaveerudi Katha) సినిమా నుండి ‘శివశంకరి’ పాట పాడారు. అప్పట్లో ఈ పాట చాలా పెద్ద హిట్, ఘంటసాల పాడారు. గమకాలు, కష్టమైన స్వరాలు కలిగిన ఈ పాటను బాలయ్య అద్భుతంగా పాడటంతో అక్కడున్న ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లు కొట్టారు. బాలయ్య పూరీ జగన్నాథ్(Puri Jagannath)​ కాంబినేషన్లో నటించిన పైసా వసూల్(Paisa vasool)​ సినిమాలోనూ ఓ పాట పాడిన సంగతి తెలిసిందే.

కాగా బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అనిల్​ రావిపూడి(Anil Ravipudi), బాబి, బోయపాటి శ్రీనివాస్​.. ఇలా టాప్​ డైరెక్టర్లతో వరుస ప్రాజెక్టులతో మంచి జోరు మీదున్నారు బాలకృష్ణ. NBK108 వర్కింగ్​ టైటిల్​తో అనిల్​ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కాజల్​ అగర్వాల్(Kajal Aggarval)​ హీరోయిన్​గా నటిస్తుండగా శ్రీలీల(Sreeleela) కీలకపాత్రలో కనిపించనుంది.