“ఆయ‌న హాయిగా నిద్ర‌పోతాడు.. మ‌రి మేము?”

Delhi: కొన్ని నెల‌లుగా ఆందోళన చేస్తున్న భార‌తీయ రెజ్ల‌ర్లపై(wrestlers protest) పోలీసులు అమర్యాద‌క‌రంగా ప్రవ‌ర్తించారు. దాంతో వారు మీడియా ముందు క‌న్నీరుపెట్టుకున్నారు. చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ సింగ్ త‌మను లైంగికంగా వేధించారని, అత‌న్ని చీఫ్ ప‌ద‌వి నుంచి తొల‌గించి వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని దిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్నారు. అక్క‌డే రోడ్ల‌పై టెంట్లు వేసుకుని ఉంటున్నారు. అయితే నిద్ర‌పోయే ప్ర‌దేశంలో నీళ్లు పోస్తున్నార‌ని, త‌మ‌ను ఇన్‌డైరెక్ట్‌గా బెదిరిస్తున్నార‌ని వాపోయారు. అయితే నిన్న మంచాలు ఏర్పాటుచేసుకుంటుండ‌గా ఓ పోలీసు తాగి త‌మ‌తో అమ‌ర్యాద‌క‌రంగా ప్ర‌వర్తించాడ‌ని రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్ వాపోయారు. బ్రిజ్ భూష‌ణ్ ఇంట్లో హాయిగా నిద్ర‌పోతున్నాడ‌ని, త‌న వ‌ల్ల ఎంతో అనుభ‌వించిన తాము మాత్రం ఇలా రోడ్ల‌పై ప‌డి క‌ష్ట‌ప‌డుతున్నామంటూ క‌న్నీరుపెట్టుకున్నారు.