Vizag బీచ్‌లో గ‌ర్భిణి మృత‌దేహం.. ఆత్మ‌హ‌త్యేనా?

Vizag: నీకు అన్నీ తెలుసు.. నిన్ను నువ్వు ప్ర‌శ్నించుకో.. అంటూ ఓ గ‌ర్భిణి లేఖ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న వైజాగ్‌లో(vizag) క‌ల‌క‌లం రేపింది. మంగ‌ళ‌వారం రాత్రి వైజాగ్(vizag) ఆర్కే బీచ్‌(rk beach)కు ఓ యువ‌తి మృత‌దేహం కొట్టుకుని వ‌చ్చింది. దాంతో స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. మృతురాలు శ్రీకాకుళంకు చెందిన శ్వేత‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శ్వేత‌కు ఏడాది క్రితం వైజాగ్‌కు చెందిన మ‌ణికంఠ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం శ్వేత ఐదు నెల‌ల గ‌ర్భిణి. ఏం జ‌రిగిందో ఏమో కానీ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఇంటికి తాళం వేసుకుని ప‌క్కంటివారికి ఇచ్చి శ్వేత బ‌య‌టికి వెళ్లింది. శ్వేత అత్తింటివారు ఇంటికి వ‌చ్చేస‌రికి తాళం వేసి ఉంది. ఎంత సేపైనా శ్వేత ఇంటికి రాక‌పోయే స‌రికి అత్తింటివారు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి బీచ్‌కు శ్వేత మృతదేహం కొట్టుకొచ్చింది. అప్ప‌టికే ఇంట్లోని ఓ గ‌దిలో శ్వేత రాసిన లేఖ ల‌భ్యమైంది. అందులో.. “నేను లేక‌పోతేనే నువ్వు సంతోషంగా ఉంటావ‌ని తెలుసు. నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఆల్ ది బెస్ట్. నీతో చాలా చెప్పాల‌ని ఉంది కానీ చెప్ప‌లేక‌పోతున్నాను” అని లేఖ‌లో పేర్కొంది. పెళ్లి స‌మ‌యంలో క‌ట్నంగా రూ.10 ల‌క్ష‌లు ఇచ్చామ‌ని అవి చాల్లేద‌ని అత్తింటివారు బాధ‌పెట్టినందుకే త‌మ కూతురు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని శ్వేత త‌ల్లి క‌న్నీరుమున్నీరైంది.