Mobile: ముఖంపై పేలిన ఫోన్.. బాలిక మృతి

Kerala: మొబైల్ ఫోన్(mobile) ముఖంపై పేలిపోవ‌డంతో బాలిక చ‌నిపోయిన బాధాక‌ర ఘ‌ట‌న కేర‌ళ‌లో(kerala) చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళితే.. థ్రిశ్శూర్‌కి చెందిన అదిత్య‌శ్రీ అనే 8 ఏళ్ల బాలిక సోమ‌వారం రాత్రి 10.30 ప్రాంతంలో ఫోన్‌లో ఆడుకుంటూ కూర్చుంది. అది వేడెక్కిపోవ‌డంతో ముఖంపై పేలిపోయింది. దాంతో ముఖం అలా తీవ్రంగా కాలిపోయింది. అలా బాలిక అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.