సింగ‌ర్‌ని ఈవెంట్‌కి పిలిచి.. పాడుతుంటే అవ‌మానించి..

Bihar: ఓ సింగ‌ర్‌ని(priyanka singh) ఈవెంట్‌కి పిలిచి స్టేజ్‌పై అవ‌మానించారు. దాంతో ఆమె స్టేజ్‌పైనే క‌న్నీరుపెట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న బిహార్లో చోటుచేసుకుంది. నిన్న బిహార్‌లో థావే మ‌హోత్స‌వం(thawe event) ఘ‌నంగా జ‌రిగింది. దాంతో భారీగా ఈవెంట్ ప్లాన్ చేసారు. ఈవెంట్‌కు ప్రియాంక సింగ్ అనే భోజ్‌పురి సింగ‌ర్‌ను గెస్ట్‌గా పిలిచారు. ఆమెతో స్టేజ్‌పై పాడించాల‌ని అనుకున్నారు. అయితే ప్రియాంక సింగ్ పాడుతుంటే.. యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రూప‌మ్ త్రివిక్ర‌మ్ అనే వ్య‌క్తి ఇంక చాలు టైం అయిపోతోంది అంటూ మైక్ లాగేసుకున్నాడు. ఒక్క నిమిషం ఆగండి.. నేను చెప్పేది వినండి అని ప్రియాంక సింగ్ రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వినిపించుకోలేదు. దాంతో ఆమె స్టేజ్‌పైనే అవ‌మానంగా ఫీలై క‌న్నీరుపెట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ త‌ర్వాత ప్రియాంక సింగ్ దీని గురించి స్పందిస్తూ..నేనేం పాడాల‌ని గింజుకోవ‌ట్లేదు.. మీరే న‌న్ను ఈవెంట్‌కు పిలిచారు. మీరు న‌న్ను ఇలా అవ‌మానించ‌కూడ‌దు. నా ప‌ట్ల జ‌రిగింది త‌ప్పు. ఈ థావే మ‌హోత్సవంలో నాకు చేదు అనుభ‌వం ఎదురైంది అని బాధ‌ప‌డ్డారు. దాంతో నెటిజ‌న్లు యాంక‌ర్ ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టిస్టుల‌కు గౌర‌వం ఇవ్వ‌న‌ప్పుడు ఎందుక పిలిచి అవ‌మానిస్తారు అంటూ మండిప‌డుతున్నారు.