“అంద‌రూ బిజీ..” IIT స్టూడెంట్ ఆత్మ‌హ‌త్య‌

Chennai: “ఎవ్వ‌రికీ టైం లేదు.. అంద‌రూ బిజీ” అని లెట‌ర్ రాసి ఓ ఐఐటీ(iit) విద్యార్థి ఆత్మ‌హ‌త్య(suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న చెన్నైలో చోటుచేసుకుంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన 20 ఏళ్ల యువ‌కుడు మ‌ద్రాస్ ఐఐటీలో కెమిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దువుతున్నాడు. నిన్న కాలేజ్ హాస్ట‌ల్‌లో ఆ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వెంటనే స్టూడెంట్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. విచార‌ణ‌కు వ‌చ్చిన పోలీసులు యువ‌కుడి రూంలో ఓ లెట‌ర్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎవ్వ‌రికీ టై లేదు..అంద‌రూ బిజీనే అని రాసి ఉంది. కాక‌పోతే ఆ లెట‌ర్‌లో యువ‌కుడి సంత‌కం లేదు. అంతేకాదు.. త‌న ఫ్రెండ్స్ త‌న‌తో చాలా బాగా మాట్లాడేవార‌ని చెప్తూ వారికి థ్యాంక్స్ కూడా చెప్పాడు. విప‌రీత‌మైన ఒత్తిడితో క‌నీసం మాట్లాడ‌టానికి కూడా ఎవ‌రూ లేర‌న్న బాధ‌తోనే ఆ అబ్బాయి చ‌నిపోయి ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఐఐటీ మ‌ద్రాస్‌లో ఇలా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న బ‌య‌టికి రావ‌డం ఇది నాలుగో సారి. అంత‌కుముందు కూడా ముగ్గురు విద్యార్థులు ఇలాగే సూసైడ్ చేసుకోవ‌డం క‌ల‌వ‌రం సృష్టిస్తోంది.