Marriage: పెళ్లిలో విషాదం.. మ‌రుగుతున్న ర‌సంలో ప‌డి…

Chennai: పెళ్లి(marriage) వేడుక‌లో విషాదం చోటుచేసుకుంది. అంద‌రూ స‌ర‌దాగా భోజ‌నాలు చేస్తున్న స‌మ‌యంలో ఓ యువ‌కుడు మ‌రుగుతున్న ర‌సం(rasam)లో ప‌డి మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు(tamilnadu)లో చోటుచేసుకుంది. తిరువ‌ళ్లూరు జిల్లాకు చెందిన స‌తీష్ అనే 21 ఏళ్ల యువ‌కుడు క్యాట‌రింగ్ టీంలో ప‌నిచేస్తున్నాడు. బీసీఏ చ‌దువుతూ పార్ట్ టైంలో క్యాటరింగ్ ప‌నులు చూసుకుంటూ ఉంటాడు. పెళ్లి వేడుక‌లో భోజ‌నాలు వ‌డ్డిస్తున్న స‌మ‌యంలో అదుపుత‌ప్పి అక్క‌డే ఉన్న‌ మ‌రుగుతున్న ర‌సం బాణ‌లిలో ప‌డిపోయాడు. దాంతో ఒళ్లంతా 80% కాలిపోయింది. వెంట‌నే అత‌న్ని స్థానిక హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లిన‌ప్ప‌టికీ ప్రయోజనం లేకుండా పోయింది. ట్రీట్మెంట్ ఇస్తుండ‌గానే అత‌ను చ‌నిపోయాడు. దాంతో పోలీసులు అస‌హ‌జ మ‌ర‌ణం సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం చేసిన త‌ర్వాత బాడీని తల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. దాంతో పెళ్లి పందిరిలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.