Telangana: 34 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

Telangana: తెలంగాణ(telangana)లోని పలు ఫ్యాక్టరీల్లో ఉపాధి కోసం బీహార్‌(bihar) రాష్ట్రం నుంచి రైల్లో వస్తున్న మైనర్ల(minors)ను పోలీసులు రక్షించారు. దాదాపు 34 మంది చిన్నారులను బీహార్ నుంచి అక్రమంగా రైల్లో తరలిస్తుండగా.. వరంగల్‌(warangal) కాజీపేటలో పోలీసులు వారిని కాపాడారు. ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి, బాలల సంక్షేమ అధికారుల సంయుక్త బృందం ఆధ్వర్యంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో సోదాలు చేయగా నలుగురు బ్రోకర్లు సికింద్రాబాద్‌కు అక్రమంగా ఈ మైనర్లను వివిధ పనుల నిమిత్తం తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని రక్షించారు.