srh vs mumbai: ఉప్పల్‌ స్టేడియంలో కొట్టుకున్న ఫ్యాన్స్

Hyderabad: ఇండియాలో క్రికెట్‌(cricket)ను ఇష్టపడటం కాదు… చాలా మంది ఆరాధిస్తుంటారు. అదేవిధంగా తమ అభిమాన క్రీడాకారులకు మంచి సపోర్టు ఇస్తుంటారు. ఇక ఐపీఎల్‌(ipl) మ్యాచ్‌లు సమయంలో ఆ అభిమానం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ సమయంలో ఉండే హైప్‌ వేరేలా ఉంటుంది. కొందరు జట్లకు అభిమానులు కాగా… మరి కొందరు ప్లేయర్లకు అభిమానులుగా ఉంటారు. నచ్చని క్రికెటర్‌ లేదా బాగా ఆడని వారిపై సోషల్‌ మీడియాల్లో మీమ్స్‌, వీడియోలు పెడుతూ.. ట్రోల్స్‌ చేస్తుంటారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట.. ప్రస్తుతం సై అంటే సై అంటూ బాహాబాహీకి దిగుతున్నారు. ఇలాంటి సంఘటనే ఇవాళ ఉప్పల్‌ స్టేడియంలో(uppal stadium) చోటుచేసుకుంది.

ఉప్పల్‌ స్టేడియం వేదికగా.. ఇవాళ హైదరాబాద్‌(srh) ముంబై(mumbai) జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈక్రమంలో ఇరు వర్గాల అభిమానుల మధ్య బెట్టింగ్‌ జరిగింది. అది కాస్త గొడవలకు దారి తీసింది. ఇరు వర్గాల ఫ్యాన్స్‌ దాడులకు దిగారు. రెండు గ్రూపులుగా విడిపోయి.. కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. అభిమానులకు నచ్చజెప్పారు. అయితే.. వివాదానికి కారణం అయిన వాళ్లను స్టేడియం నుంచి పోలీసులు బయటికి పంపించేశారు. తదుపరి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.