మావోయిస్టుల ఘాతుకం.. 10 మంది పోలీసులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గ‌ఢ్‌లో(chhattisgarh) దారుణం చోటుచేసుకుంది. దంతేవాడ(dantewada) ప్రాంతంలో మావోయిస్టులు(maoists) పేలుళ్ల‌కు(bomb blast) పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది పోలీసులు(police) అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. పోలీసులు ప్ర‌యాణిస్తున్న వ్యాన్‌ను న‌డుపుతున్న డ్రైవర్ కూడా చ‌నిపోయాడు. బ‌స్త‌ర్ జిల్లాలోని మావోయిస్టులు(maoists) ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మావోయిస్టులు దంతేవాడ‌లో ఉన్నార‌ని ఇంటెల్లిజెన్స్ వ‌ర్గాల నుంచి స‌మాచారం రావ‌డంతో యాంటీ మావోయిస్ట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఆప‌రేష‌న్ ముగిసాక తిరిగి వెళ్తుంటే మావోయిస్టులు పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు.