బిడ్డ‌కు స్నానం చేయించింది.. అంత‌లోనే విషాదం

Amaravathi: ఆడుతూ పాడుతూ క‌ళ్ల ముందే ఆడుకుంటున్న బిడ్డ‌కు స్నానం చేయించింది. ఏదో ప‌ని ఉండి ఇంట్లోకి వెళ్లిన ఆ క‌న్న‌త‌ల్లి..బ‌య‌టికి వ‌చ్చి చూసేస‌రికి బిడ్డ చ‌నిపోయాడ‌ని తెలిసి త‌ల్ల‌డ‌ల్లిపోయింది. ఈ ఘ‌ట‌న అమ‌రావ‌తి(amaravathi)లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళితే.. ప‌ట‌మ‌ట‌లంకకు చెందిన శివ‌య్య కూలీప‌నులు చేసుకుంటూ భార్య, బిడ్డ‌ను పోషించుకుంటున్నాడు. వీరికి 3 ఏళ్ల సంజ‌య్ అనే కుమారుడు ఉన్నాడు. నిన్న రాత్రి శివ‌య్య భార్య మ‌ల్లీశ్వ‌రి బిడ్డ‌కు స్నానం చేయించి ట‌వ‌ల్ తీసుకురావ‌డానికి ఇంట్లోకి వెళ్లింది. అదే స‌మ‌యంలో మామిడికాయ‌ల లోడ్‌తో వ‌స్తున్న లారీ ఒక్క‌సారిగా అదుపు త‌ప్పి శివ‌య్య ఇంటి వైపు దూసుకొచ్చి బోల్తాప‌డింది. ఈ క్ర‌మంలో లారీ కింద సంజ‌య్ ఇరుక్కుపోయాడు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో క్రేన్ సాయంతో డ్రైవ‌ర్, క్లీన‌ర్‌ను బ‌య‌టికి తీసారు. వారికి గాయాల‌య్యాయి. ఆ త‌ర్వాత క్రేన్ సాయంతో లారీని పైకి ఎత్తి సంజ‌య్‌ను బ‌య‌టికి తీసారు. అప్ప‌టికే స్పృహ‌లో లేని సంజ‌య్‌ను స్థానిక హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అయితే లారీ కింద ఇరుక్కుపోవ‌డంతో ఊపిరాడ‌క సంజ‌య్ చ‌నిపోయినట్లు డాక్ట‌ర్లు తెలిపారు. బిడ్డ‌కు అప్పుడే నూరేళ్లు నిండిపోవ‌డంతో ఆ క‌న్న‌త‌ల్లి రోద‌న‌లు మిన్నంటాయి.