Madhya Pradesh:బ్రిడ్జి పై నుంచి పడిన బస్సు..22 మంది దుర్మ‌ర‌ణం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఖార్గోన్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ  బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్​లోని శ్రీఖండి(Shrikhandi) నుంచి ఇండోర్‌ (Indore) వెళ్తున్న బస్సు ఖార్గోన్‌ (Khargone) జిల్లాలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. నదిపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణాలేంటో తెలియలేదు.