Covid: మళ్లీ 10 వేల పైనే కరోనా కేసులు

Delhi: భారత్(india) లో కరోనా(corona) మరోసారి పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా వేలల్లోనే కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో(past 24 hours) కొత్తగా 10,753 పాజిటివ్ కేసులు(positive cases) వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ(central health department) తెలిపింది. దీంతో భారత్ లో మొత్తం యాక్టివ్ కేసుల(Active cases) సంఖ్య 53,720కి చేరింది. నెల రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ ఉండగా… ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటేయడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ కారణంగా తాజాగా 27 మరణాలు నమోదయ్యాయి. దాంతో, ఇప్పటివరకూ 5,31,091 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన xbb.1.16 కారణం అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 6.78 శాతానికి చేరుకుంది.