Gas leak: పంజాబ్‌లో దారుణం.. 9 మంది మృతి

Punjab: పంజాబ్‌(punjab)లో దారుణం చోటుచేసుకుంది. లుధియానా(ludhiana) ప్రాంతంలోని గియాస్‌పురలో ఓ ఫ్యాక్ట‌రీ నుంచి గ్యాస్ లీక్(gas leak) అయింది.  దాదాపు 9 మంది మృత్యువాతప‌డ్డారు. మ‌రో 11 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స్థానిక అధికారులు, పోలీసులు, NDRF సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని స్పృహ‌కోల్పోయిన‌వారిని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈరోజు ఉద‌యం 7:15 ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఇంకా చాలా మంది చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. స్థానికుల వివ‌రాల ప్ర‌కారం గోయ‌ల్ మిల్క్ ప్లాంట్ ఫ్యాక్టరీలోని కూలింగ్ సిస్ట‌మ్ నుంచి గ్యాస్ లీకైంది. దాంతో చుట్టుప‌క్క‌ల ఇంట్లోని వారు ఉన్న‌ట్టుండి స్పృహ‌త‌ప్పి ప‌డిపోయారు. దాంతో మాస్కులు ధ‌రించి వారిని వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఫ్యాక్ట‌రీకి ద‌గ్గర్లో ఉండేవారు గ్యాస్ విప‌రీతంగా పీల్చ‌డంతో ఊపిరాడ‌క చ‌నిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు.