Hyderabad crime : మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన దుండగులు

Hyderabad: మహిళలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం.. హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్‌లో దారుణం (Atrocious) చోటుచేసుకుంది. ఓ మహిళ(woman) ఒంటిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన అత్తాపూర్ (Attapur) పిల్లర్ నెంబర్ 133 వద్ద జరిగింది. అయితే.. తన భర్తే.. ఒంటిపై పెట్రోల్‌(Petrol) పోసినట్లు బాధిరాలు వాపోతుంది. ఇక సుమారు యాభై శాతం కాలిన గాయాలతో మహిళ రోడ్డుపై పడిపోగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్తాపూర్‌లో సాయిబాబా దేవాలయం (Saibaba Temple) దగ్గర బాధితురాలు యాచకురాలుగా ఉంటున్న శివానీగా పోలీసులు గుర్తించారు. ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదని, ఓ పాప కూడా ఉందని వారు పేర్కొన్నారు. భర్తకు దూరంగా ఉంటోందని పోలీసులు తెలుసుకున్నారు. అయితే శివానినీ తగల బెట్టింది ఎవరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన భర్తే తనపై పెట్రోల్ పోసి తగలబెట్టాడని బాధితురాలు చెబుతోంది. అయితే.. అది వాస్తవమా కాదా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.