గుడ్ న్యూస్..త్వరలో DSC నోటిఫికేషన్‌!

vijayawada: ఏపీలో ఎప్పటి నుంచో డీఎస్సీ(dsc notification) కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) గుడ్‌ న్యూస్(good news) చెప్పారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. దీనిపై సీఎం జగన్‌(cm jagan) విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై ఇప్పటికే సమీక్షించామని.. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని బొత్స పేర్కొన్నారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తున్నామని.. దీని కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే ఎన్ని పోస్టులు ఉంటాయి అన్నదానిపై స్పష్టత లేదు. కానీ పదివేలకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.