Crime News: మేడారం వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

Crime News: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్ర‌మాదం చోటుచేసుకుంది. మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి.