టీచ‌ర్ బర్త్‌డే పార్టీ.. 22 మంది స్టూడెంట్స్‌కి అస్వ‌స్థ‌త‌

Delhi: టీచ‌ర్(teacher) బర్త్‌డే పార్టీకి(birthday party) అని వెళ్లి.. 22 మంది విద్యార్థులు(students) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని దిల్లీలో(delhi) చోటుచేసుకుంది. సౌత్ దిల్లీలో ఉన్న ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న ఓ టీచ‌ర్ స్కూల్‌లోనే బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు. కేక్‌, స్వీట్స్, కూల్‌డ్రింక్స్ తాగిన త‌ర్వాత కూడా పిల్ల‌లు బాగానే ఉన్నారు. కానీ కొంత‌సేప‌టికే వారంతా క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. వెంట‌నే వారిని ద‌గ్గ‌ర్లోని స‌ఫ్దార్‌గంజ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారంతా కోలుకుంటున్నారని, ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని వైద్యులు తెలిపారు. అయితే.. స్కూల్‌లో ఉన్న ఓ పెప్ప‌ర్ స్ప్రేని డియోడ‌రెంట్ అనుకుని స్ప్రే చేయ‌డం వ‌ల్లే వారంతా క‌ళ్లు తిరిగి ప‌డిపోయార‌ని పోలీసులు తెలిపారు.