“యువ‌రాజ్ సింగ్ ద్వారా క‌పిల్ దేవ్‌పై ప‌గ తీర్చుకున్నా”

yograj singh says he wanted to take revenge through yuvraj singh on kapil dev

Yograj Singh: త‌న కుమారుడు యువ‌రాజ్ సింగ్ పుట్టిన‌ప్పుడే మాజీ టీమిండియా కెప్టెన్ క‌పిల్ దేవ్‌పై పగ తీర్చుకోవాల‌నుకున్నాన‌ని అన్నారు మాజీ క్రికెట‌ర్ యోగ్ రాజ్ సింగ్. క‌పిల్ దేవ్ ఆడుతున్న స‌మ‌యంలో యోగ్ రాజ్ కూడా మంచి ఫాంలో ఉన్నారు. కానీ క‌పిల్‌కి ఎక్క‌డ కాంపిటీష‌న్‌కు వ‌చ్చేస్తాడో అని త‌న కెరీర్‌ను నాశ‌నం చేసార‌ని ఆరోపించారు. త‌న కెరీర్‌ను క‌పిల్ దేవ్ నాశ‌నం చేసిన‌ట్లే.. త‌న కుమారుడు యువ‌రాజ్ సింగ్ కెరీర్‌ను మ‌హేంద్ర సింగ్ ధోనీ నాశ‌నం చేసాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు. ధోనీ త‌న కుమారుడి కెరీర్‌లో వేలు పెట్ట‌కపోయి ఉంటే మ‌రో నాలుగైదేళ్లు ఆడేవాడే అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

క‌పిల్ దేవ్ త‌న‌కు చేసిన ద్రోహానికి త‌న కుమారుడు యువ‌రాజ్ పుట్టిన‌ప్పుడే క‌పిల్‌పై ప‌గ తీర్చుకోవాల‌ని అనుకున్న‌ట్లు తెలిపారు. యువ‌రాజ్ కెరీర్ మొత్తంలో 13 ట్రోఫీలు గెలిచాడ‌ని.. కానీ క‌పిల్ దేవ్ కేవ‌లం ఒక్క ప్ర‌పంచ క‌ప్ టైటిలే గెలిచాడ‌ని అన్నారు. క‌పిల్ దేవ్ ఓడిపోయాడు అని చెప్ప‌డానికి త‌న కుమారుడు సాధించిన 13 ట్రోఫీలు చాలంటూ యోగ్‌రాజ్ సింగ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయ‌డం క్రికెట్ రంగంలో సంచ‌ల‌నం సృష్టించింది.