Vamsi Krishna: ఆంధ్ర ఆట‌గాడి దూకుడు..!

Vamsi Krishna: టీ20 యుగంలో చాలా మంది బ్యాట‌ర్లు అవ‌లీల‌గా సిక్స‌ర్లు బాదేస్తున్నారు. ఒక ఓవ‌ర్‌లో రెండు లేదంటే మూడు నాలుగు సిక్స్‌ల‌ను కొట్టేస్తున్నారు. అయితే.. ఓవ‌ర్‌లోని ఆరు బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు కొట్ట‌డం అన్న‌ది అత్యంత అరుదు అని చెప్ప‌వ‌చ్చు. 2007లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్‌ యువ‌రాజ్ సింగ్‌ ఆరు బంతుల‌ను ఆరు సిక్స‌ర్లుగా మ‌లిచాడు. దీన్ని అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోర‌న్న సంగ‌తి తెలిసిందే.

22 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ వంశీ కృష్ణ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ టోర్నమెంట్‌లో T-20 వలె తుఫాన్ బ్యాటింగ్‌తో బీభత్సం నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రవిశాస్త్రి (1985), యువరాజ్ సింగ్ (2007), రుతురాజ్ గైక్వాడ్ (2022)ల క్లబ్‌లో చేరాడు.

ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జరుగుతోంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ వంశీకృష్ణ తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ 22 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ టోర్నమెంట్‌లో T-20 లాగా తుఫానుగా బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. వంశీ పేలుడు బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ స్వయంగా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. (Vamsi Krishna)

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో యువ‌రాజ్ సింగ్ (భార‌త్‌), కీర‌న్ పొలార్డ్ (వెస్టిండీస్‌), వ‌న్డేల్లో హెర్ష‌ల్ గిబ్స్ (ద‌క్షిణాఫ్రికా), జస్కరణ్‌ మల్హోత్రా (అమెరికా) లు ఉన్నారు. ఇక ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ర‌విశాస్త్రి (భార‌త్‌), గ్యారీ సోబ‌ర్స్ (వెస్టిండీస్‌). లీ జెర్మ‌న్ (న్యూజిలాండ్‌), దేశ‌వాలీ టీ20ల్లో లియో కార్ట‌ర్ (న్యూజిలాండ్‌), రోజ్‌వైట్లీ (ఇంగ్లాండ్‌), హ‌జ్ర‌తుల్లా జ‌జాయ్ (అఫ్గానిస్తాన్) లు ఉన్నారు. ఇక దేశ‌వాలీ వ‌న్డేల్లో రుతురాజ్ గైక్వాడ్ (భార‌త్‌), తిసారా పెరీరా (శ్రీలంక‌) లు ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు కొట్టారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్, రైల్వేస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రప్రదేశ్ జట్టు ఓపెనర్ వంశీకృష్ణ.. రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఒక్క ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు బాదాడు. వంశీ కేవలం 64 బంతుల్లోనే 110 పరుగులతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. అతని అద్భుత ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. వంశీ కృష్ణ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన తర్వాత రవిశాస్త్రి (1985), యువరాజ్ సింగ్ (2007), రుతురాజ్ గైక్వాడ్ (2022)ల క్లబ్‌లో చేరాడు. కాగా, రైల్వేస్‌ తరపున ఎస్‌ఆర్‌ కమర్‌, ఎండీ జైస్వాల్‌లు తలో మూడు వికెట్లు తీశారు.

సత్తా చాటిన రైల్వేస్

విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను 378 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ చేసిన రైల్వేస్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. రైల్వేస్ ఓపెనర్ అన్ష్ యాదవ్ బౌలర్లపై భీకరంగా దాడి చేసి 597 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 268 పరుగులు చేశాడు.

దీంతో పాటు రవి సింగ్ కూడా 311 బంతుల్లో 17 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 258 పరుగులు చేశాడు. అంచిత్ యాదవ్ 219 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగులు చేసి సెంచరీ చేశాడు. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 865 పరుగులు చేసి 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.