Shoaib Akhtar: ఓడిపోవ‌డానికి పాపం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో..!

Shoaib Akhtar taunts pakistan cricket team for losing

Shoaib Akhtar:  మొన్న న్యూయార్క్ వేదిక‌గా జ‌రిగిన ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో పాక్ ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా త‌క్కువ స్కోర్ చేసిన‌ప్ప‌టికీ దానిని చేజ్ చేయ‌లేక‌పోయింది. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయెబ్ అక్త‌ర్ మండిప‌డ్డారు. పాపం ఓడిపోవ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డారో అంటూ పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌పై సెటైర్లు వేసారు.

“” పాకిస్థాన్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఓడిపోయినందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇంత‌కు మించి నాకే ఆలోచ‌న రావ‌డంలేదు. అత్యంత బాధాక‌రంగా షాకింగ్‌గా ఉంది. పాకిస్థాన్ క్రికెట్ టీంలో ఉన్న‌వారంతా సామాన్య ఆటగాళ్లు. వాళ్లు భ‌విష్య‌త్తులో ఏదో సాధించేస్తార‌న్న న‌మ్మకం కూడా లేదు. వీళ్లు మార‌రు. “” అని మండిప‌డ్డారు.