కోహ్లీ రోహిత్ స‌రిగ్గా ఆడ‌లేదు.. BCCI స్పెష‌ల్ ట్రీట్మెంట్ ఎందుకు?

sanjay manjrekar slams virat kohli rohit sharma

Sanjay Manjrekar: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు BCCI స్పెష‌ల్ ట్రీట్మెంట్ ఇస్తోంద‌ని ఆరోపించారు మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్. వారిద్ద‌రి స్టేటస్ వేర‌ని.. అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న క్రికెట‌ర్లు కావ‌డంతో వారిద్ద‌రినీ దులీప్ ట్రోఫీ లాంటి క్రికెట్‌లో ఆడక‌పోయినా ఏమీ అన‌డం లేద‌ని.. ఆ ఫ‌లితం బంగ్లాదేశ్ సిరీస్‌లో బాగా క‌నిపించింద‌ని ఆయ‌న అన్నారు. ఇండియాను గెలిపించేలా చేసింది ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్, శుభ్‌మ‌న్ గిల్, జ‌స్ప్రీత్ బుమ్రా, రిష‌భ్ పంత్ మాత్ర‌మే అని కోహ్లీ, రోహిత్ స‌రిగ్గా ఆడ‌లేద‌ని అన్నారు.

అదే సిరీస్‌కి ముందు దులీప్ ట్రోఫీ ఆడి ఉంటే పెర్ఫామెన్స్ బాగుండేద‌ని.. కానీ వారికి వారు దులీప్ లాంటి చిన్న ట్రోఫీల్లో ఆడితే త‌క్కువైపోతారు కాబ‌ట్టి ఆడ‌ర‌ని అన్నారు. ఇక వారి నిర్ణ‌యాన్ని బీసీసీఐ స్పెష‌ల్‌గా ప‌రిగ‌ణిస్తుందని ఆరోపించారు. ఇది స‌రైన ప‌ద్ధతి కాద‌ని.. పెర్ఫామెన్స్ పెర‌గ‌డానికి చిన్న చిన్న ట్రోఫీల్లో ఆడినంత‌మాత్రాన స్టేట‌స్ త‌గ్గిపోద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.