IND vs BAN: రోహిత్ వారితో క‌లిసి ఎప్పుడూ తిన‌డు

rohit sharma does not sit and eat with seniors says dhruv jurel

IND vs BAN: కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎప్పుడూ కూడా సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌తో కూర్చుని భోజ‌నం చేయ‌డం వంటివి చేయ‌డ‌ని తెలిపాడు ధృవ్ జురేల్. ఎంతో మంది సీనియ‌ర్ ప్లేయ‌ర్లు భోజనం చేస్తున్న‌ప్పుడు రోహిత్‌ని పిలిచినా కూడా మీరు కానివ్వండి అని చెప్పి త‌న లాంటి యంగ్ ప్లేయ‌ర్స్‌తో మాత్ర‌మే క‌లిసి భోజ‌నం చేసేవాడ‌ని తెలిపాడు.

తినేట‌ప్పుడు త‌మ‌కు ఏవ‌న్నా క్రికెట్‌కు సంబంధించిన సందేహాలు ఉన్నా కూడా రోహిత్ వాటి గురించి మాట్లాడ‌ద్దు అంటాడ‌ని.. కేవ‌లం తిండిపై దృష్టి పెట్ట‌మంటాడ‌ని అన్నాడు. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కానీ ప్రాక్టీస్ మ్యాచ్ వేళ‌ల్లో కానీ ఇండియ‌న్ జెర్సీ వేసుకున్నామంటే అదృష్టం ఉండాల‌ని.. ఆట ప‌ట్ల నిబ‌ద్ధ‌త క‌లిగి ఉండాల‌ని ప్రోత్స‌హిస్తుంటాడ‌ని జురేల్ వెల్ల‌డించాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో జురేల్‌కు ఆడే అవ‌కాశం వ‌చ్చింది. త‌న స‌త్తా ఆ సిరీస్‌లో నిరూపించుకుని త్వ‌ర‌లో బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌బోయే సిరీస్‌లో చోటు ద‌క్కించుకున్నాడు జురేల్.