“నెక్స్ట్ ధోనీ అత‌నే”

MS Dhoni: ఇప్పుడున్న క్రికెట‌ర్ల‌లో అద్భుత‌మైన మ్యాచ్ ఫినిష‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే అది మ‌హేంద్ర సింగ్ ధోనీనే. ధోనీ త‌ర్వాత అలాంటి ఆట‌గాడి కోసం టీమిండియా ఎదురుచూస్తోంది. అయితే అలాంటి ఆట‌గాడు దొరికేసాడ‌ని అన్నారు ప్ర‌ముఖ క్రికెటర్ న‌వ‌జోత్ సింగ్ సిధు (Navjot Singh Sidhu). ఆ ఆట‌గాడు ఎవ‌రో కాదు 26 ఏళ్ల రింకూ సింగ్. ధోనీ లాగే రింకూ సింగ్‌లో ఓ మంచి ఫినిష‌ర్ ఉన్నాడ‌ని సిధూ అభిప్రాయ‌ప‌డ్డారు.  ప్ర‌స్తుతం రింకూ సింగ్ క‌లక‌త్తా నైట్ రైడ‌ర్స్ టీంలో ఫినిష‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో రింకూకి ఆడేందుకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. అయితే త్వ‌ర‌లో జ‌ర‌గబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రింకూ స్థానం ద‌క్కించుకోలేక‌పోయాడు.