Bangladesh Series: రిష‌భ్ పంత్ ట్రిక్ ఫాలో అయ్యా.. బాదేసా

ravichandran ashwin Bangladesh Series

Bangladesh Series: ఈరోజు చెన్నైలో జ‌రిగిన బంగ్లాదేశ్ సిరీస్‌లో టాప్ ఆర్డ‌ర్ ఆట‌గాళ్లే కీల‌కంగా మారారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీను నిరాశ‌ప‌రిచారు. టాప్ ఆర్డ‌ర్‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ 102 బంతుల్లో 112 ప‌రుగులు తీసాడు. అశ్విన్‌తో పాటు ర‌వీంద్ర జ‌డేజా హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో మ్యాచ్ గ‌ట్టెక్కింది. మ్యాచ్ త‌ర్వాత అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ.. రిష‌భ్ పంత్ ట్రిక్ ఫాలో అయ్యాను కాబ‌ట్టే బాదేసానని అన్నారు.

పిచ్ బౌన్స్ అవుతుండడంతో పంత్ లాగా అగ్రెసివ్ బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని అదే గెలిపించింద‌ని అన్నారు. అదీకాకుండా ఎంఏ చిదంబ‌రం పిచ్‌పై అశ్విన్‌కు మంచి ప‌ట్టుంది. అగ్రెసివ్ బ్యాటింగ్ ఎంచుకోవ‌డంతో కుమ్మేసాడు. అశ్విన్‌కి క‌లిసొచ్చిన మ‌రో అంశం ఏంటంటే ఇటీవ‌ల అత‌ను త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో ఆడారు. కాబ‌ట్టి అది కూడా కాస్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అశ్విన్, జ‌డ్డూలే కాకుండా యువ ఆట‌గాళ్లైన య‌శ‌స్వి జైస్వాల్, రిష‌భ్ పంత్‌లు కూడా బాగానే ఆడారు.